telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు

tdp chandrababu

టీడీపీ మహానాడులో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వైసీపీ పాలనపై మండిపడ్డారు. జిల్లాలకు వెళ్లాలంటే జగన్ అనుమతి కావాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని, ఇదేంటని ప్రశ్నిస్తే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న తటస్థులపైనా వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక వైసీపీ అరాచకాలకు వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. ప్రజల బాగోగులు పట్టించుకోవడం మానేసి, పగ సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

Related posts