telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సుజనా చౌదరి డైరెక్షన్ లో కన్నా: మంత్రి వెల్లంపల్లి

srinivasa rao minister

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఏదో ఒక ఘటనను ప్రభుత్వానికి అంటగట్టాలని కన్నా చూస్తున్నాడని మండిపడ్డారు. ఇప్పుడు సుజనా చౌదరి డైరెక్షన్ లో కన్నా పనిచేస్తున్నారని ఆరోపించారు.నెల్లూరు జిల్లా కొండబిట్రగుంటలో ఆలయ రథానికి నిప్పు పెట్టిన ఘటనలో చర్యలు తీసుకున్నా గానీ, కావాలనే ఈ ఘటనపై కన్నా రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు.

సదావర్తి భూములను టీడీపీ నాయకులు దోచుకుంటుంటే కన్నా ఎందుకు మాట్లాడడంలేదని నిలదీశారు. అమరావతి భూములను వెనక్కి ఇచ్చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారని, దీనిపై కన్నా ఏమంటారని ప్రశ్నించారు. బీజేపీని కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ జనతా పార్టీగా మార్చేశారని వెల్లంపల్లి విమర్శించారు.

Related posts