అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. షూటింగులు మొదలు పెట్టే విషయంపై సీఎం కేసీఆర్ను సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కలిసి చర్చించిన విషయం తనకు తెలీదని బాలకృష్ణ అన్నారు. ఈ సమావేశానికి రావాలని తనను ఏ ఒక్కరూ పిలవలేదన్న బాలయ్య.. తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూర్చుని హైదరాబాద్లో భూములు పంచుకుంటున్నారా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ తదితర అంశాలపై ప్రభుత్వంతో సినిమా పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలయ్య. అయితే ఇప్పుడు బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఇక జూన్లో షూటింగులు ప్రారంభమవుతాయని అనుకుంటున్నట్లు అభిప్రాయపడ్డారు. షూటింగ్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇవ్వాలని కోరారు. ఎక్కువ శాతం షూటింగ్లు ప్రారంభమైన చిత్రాలకు త్వరగా అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సినీ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విన్నవించారు. షూటింగ్ సమయంలో సామాజిక దూరం పాటించాలని బాలయ్య స్పష్టం చేశారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
previous post