జగన్ ప్రమాణస్వీకారం, రాజ్యాంగబద్దంగా.. జాతీయ గీతంతో ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నరసింహన్ జగన్ మోహన్ రెడ్డి తో పదవి ప్రమాణం చేయించారు. జగన్ అనే నేను.. అంటూ ప్రమాణం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన కర్తవ్యాన్ని, శ్రద్ధతో, అంతర్కరణశుద్ధితో నిర్వహిస్తానని ప్రమాణం చేశాడు జగన్.
జగన్ తన కర్తవ్యాలను తగిన రీతిలో నిర్వహించడానికి ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం రాజ్యాంగ బద్దంగా పూర్తిఅయింది. అనంతరం జాతీయ గీతాలాపనతో రాజ్యాంగబద్ధమైన ప్రమాణస్వీకారం ముగించారు.