telugu navyamedia
రాజకీయ వార్తలు

లాలూకు జార్ఖండ్ హైకోర్టులో బెయిల్ మంజూరు

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు ఊరటను కలిగించింది. లాలూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ఈరోజు విచారించిన కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దేవఘర్ ఖజానా నుంచి భారీ ఎత్తున అక్రమంగా డబ్బులు డ్రా చేసిన కేసులో లాలూ శిక్షను అనుభవిస్తున్నారు.

ఈ కేసులో ఆయనకు మూడున్నరేళ్ల శిక్షను కోర్టు విధించింది. అయితే, దాణా కుంభకోణానికి సంబంధించిలాలూపై ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనకు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో, ఆయనకు బెయిల్ లభించినప్పటికీ ఇతర కేసుల వల్ల ఆయన జైల్లోనే ఉండవలిసి వస్తుందని సమాచారం.

Related posts