telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

రేవంత్ లేకుండానే.. రాహుల్ సభ.. !! మళ్ళీ కండువా మారుస్తున్నాడా..!

no revanth in rahul gandhis meeting

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శంషాబాద్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సభ ఎంత విజయవంతం అయినప్పటికీ, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. రేవంత్ హైదరాబాద్‌లోనే ఉన్నప్పటికీ సభకు గైర్హాజరు కావడంపై నేతలు చర్చించుకుంటున్నారు. నిజానికి రాహుల్ గాంధీ సభల్లో రేవంత్ ముందు వరుసలో ఉండేవారు. అటువంటి రేవంత్ సభలో కనిపించకపోవడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది.

సభ ప్రారంభంలో స్వాగత ఉపన్యాసంలోనే, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నేతలను ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డిని కూడా ఆహ్వానించారు. అయితే, ఆయనెక్కడా కనిపించకపోవడంతో నాలుక్కరుచుకున్నారు. రేవంత్‌తో పాటు మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్యలు కూడా సభకు గైర్హాజరయ్యారు. వీరు ముగ్గురు టీఆర్ఎస్‌లో చేరనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Related posts