telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ పై 11 అవినీతి కేసులు.. రాజ్యసభలో ప్రస్తావించిన కనకమేడల

MP kanaka Medala comments elections

పెండింగ్ లో ఉన్న కేసులపై ఈ రోజు రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల జగన్ పై ఉన్న అవినీతి కేసులను ప్రస్తావించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై 11 అవినీతి కేసులు ఉన్నాయని, కోర్టు విచారణకు హాజరు కాలేనని కూడా ఆయన పిటిషన్ వేశారని కనకమేడల అన్నారు. జగన్ పై ఉన్న సీబీఐ కేసుల విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రం పేరు కాని, ముఖ్యమంత్రి పేరు కాని సభలో ప్రస్తావించవద్దని చెప్పారు. కేవలం ఈ అంశం వరకే చర్చ జరగాలని సూచించారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కనకమేడల ప్రసంగానికి అడ్డుపడ్డారు. సభలో జగన్ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. దీంతో, విజయసాయి తీరుపై వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఛైర్మన్ స్థానంలో తాను ఉన్నానని, కనకమేడల వ్యాఖ్యలపై స్పందించడానికి మీరు మంత్రి కాదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కనకమేడల తన ప్రసంగాన్ని కొనసాగించారు.

Related posts