కోహ్లీసేన లార్డ్స్ లో ఆఖరి రోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..సంచలన ప్రదర్శనతో రెండో టెస్టులో 151 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అద్భుతం సృష్టించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది టీమిండియా.
మ్యాచ్ను డ్రా చేసుకున్నా గొప్పే అనుకున్న స్థితి నుంచి పట్టుదలగా పుంజుకుని..అతిథ్య జట్టుపై ఎవరూ ఊహించని విజయం సాధించింది. సోమవారం ఓవర్నైట్ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించింది భారత్. అయితే ఆదిలోనే పంత్ వికెట్ తీసి భారత్ కు షాకిచ్చింది ఇంగ్లాండ్. కాసేపటికి ఇశాంత్ కూడా వెనుదిరిగాడు.
కానీ ఊహించని విధంగా ఇంగ్లాండ్ కు షాకిచ్చారు భారత్ ఆటగాళ్లు . మహ్మద్ షమి (56 నాటౌట్; 70 బంతుల్లో 6×4, 1×6), జస్ప్రిత్ బుమ్రా 34 నాటౌట్; 64 బంతుల్లో అద్భుత బ్యాటింగ్ చేసి… తొమ్మిదో వికెట్కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.
వీరి అసాధారణ పోరాటంతో భారత్.. 298/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ తొలి ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ గెలిచిన వెంటనే ప్రముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.