telugu navyamedia
క్రీడలు రాజకీయ

లార్డ్స్‌లో అద్భుతం సృష్టించిన టీమిండియా..

 

కోహ్లీసేన లార్డ్స్ లో ఆఖ‌రి రోజు అందరి అంచనాలను తలకిందులు చేస్తూ..సంచలన ప్రదర్శనతో రెండో టెస్టులో 151 ప‌రుగుల తేడాతో ఘన విజయం సాధించింది అద్భుతం సృష్టించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దీంతో లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్ కు దిమ్మతిరిగే షాకిచ్చింది టీమిండియా.

మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా గొప్పే అనుకున్న స్థితి నుంచి పట్టుదలగా పుంజుకుని..అతిథ్య జట్టుపై ఎవ‌రూ ఊహించ‌ని విజయం సాధించింది. సోమవారం ఓవర్‌నైట్‌ స్కోరు 181/6తో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది భారత్. అయితే ఆదిలోనే పంత్ వికెట్ తీసి భారత్ కు షాకిచ్చింది ఇంగ్లాండ్. కాసేపటికి ఇశాంత్ కూడా వెనుదిరిగాడు.

కానీ ఊహించని విధంగా ఇంగ్లాండ్ కు షాకిచ్చారు భారత్ ఆటగాళ్లు . మహ్మద్‌ షమి (56 నాటౌట్; 70 బంతుల్లో 6×4, 1×6), జస్ప్రిత్‌ బుమ్రా 34 నాటౌట్‌; 64 బంతుల్లో అద్భుత బ్యాటింగ్ చేసి… తొమ్మిదో వికెట్‌కు 89 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.

IND vs ENG 2nd Test Highlights, Day 5

వీరి అసాధారణ పోరాటంతో భారత్.. 298/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్‌ చేసింది. ఆపై భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ తొలి ఓవర్‌ నుంచే వికెట్లు కోల్పోయింది. మ్యాచ్‌ గెలిచిన వెంటనే ప్ర‌ముఖులు భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు.

 

Related posts