telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారు: కేశినేని నాని

kesineni-nani

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో కుంటిసాకులతో ఎన్నికలు ఆపేశారని మండిపడ్డారు. ఇలాంటి స్థానిక ఎన్నికలను గతంలో ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించారు.

గెలవకపోతే మంత్రి పదవులు పోతాయని బెదిరిస్తున్నారని, మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన సీఎం దేశంలో మరెవరూ లేరని విమర్శించారు. ఆఖరికి జిల్లా ఎస్పీలను కూడా బెదిరిస్తున్నారని, పులివెందుల సంస్కృతిని రాష్ట్రమంతా తెస్తున్నారని నాని ఆరోపించారు. నామినేషన్లు వేయకుండా ప్రతిపక్షాల అభ్యర్థులపై బెదిరింపులకు పాల్పడే పరిస్థితి కనిపిస్తోందన్నారు.

Related posts