telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోని అంశాలు: దేవినేని

devineni on power supply

ఆంధ్రప్రదేశ్ రాజధానుల విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ తీసుకున్న నిర్ణయాలపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ‘నేల తల్లిపై మమకారాన్ని చంపుకొని 29 వేల రైతు కుటుంబాలు 34 వేల ఎకరాల భూములిస్తే అన్యాయం చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధాని, హైకోర్టు కేంద్రం పరిధిలోని అంశాలని అన్నారు.

రాజధానుల పేరిట ప్రజల జీవనోపాధిని నాశనం చేస్తారా? అలాంటి చట్టాలు తెస్తే చెల్లుబాటు కావన్నారు. కార్యాలయాలు తరలిస్తే మిగిలేది శూన్యమంటున్న రైతుల మాటలు వినబడుతున్నాయా జగన్ గారు?’ అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ఆయన పోస్ట్ చేశారు.

Related posts