ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పుష్కరిణికి భక్తులు పోటెత్తారు. కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీకమాసం చివరి రోజు అయిన కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున్న తరలివస్తున్నారు. పుష్కరిణిలో అరటి డొప్పలలో భక్తులు దీపాలు వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అలాగే పశ్చిమ గోదావరి నరసాపురంలో కార్తీక మాసం ముగియడంతో భక్తులు వశిష్ట గోదావరికి పోటెత్తారు. పోలు పాడ్యమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తులు గోదావరిలో పుణస్నానాలు ఆచరిస్తున్నారు. దీంతో స్నాన ఘటాలు రద్దీగా మారాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేసి గోదావరిలో పోలి స్వర్గం వద్ద దీపాలను వదులుతున్నారు.
చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదు: మంత్రి బొత్స