దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళనను కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రశంసించారు. “నరేంద్ర మోదీ గారు ప్రకటించిన రూ. 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ఓ మైలురాయి వంటిది.
దేశమున్న పరిస్థితుల్లో ఇది చాలా అవసరం. ఈ విపత్కర పరిస్థితులను తట్టుకుని నిలబడి గతంతో పోలిస్తే మరింత బలంగా భారతావని ఎదిగేందుకు ఉపకరిస్తుంది” అని చంద్రబాబు ట్విటర్ లో పేర్కొన్నారు.