తెలుగుదేశం పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి నేడు విజయవాడకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. తొలిసారి విజయవాడ వస్తుండడంతో ఆయన అభిమానులు హడావుడి చేస్తున్నారు.
ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విమానాశ్రయం నుంచి సుజనా విజయవాడ వరకు భారీ ర్యాలీగా రానున్నారని సమాచారం. అనంతరం కార్యకర్తలు, అభిమానులతో జరిగే సమావేశంలో పాల్గొంటారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశంలో సుజనా ఏం మాట్లాడుతారనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.