విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం రోజు రోజు ఉదృతమౌతోంది. ఇప్పటికే ఏపీలోని అన్ని పార్టీలు ప్రైవేటీకరణను వ్యతిరేకించాయి. అటు విశాఖ స్టీల్ ఉద్యమానికి ఇప్పటికే తెలంగాణ కీలక నేత, మంత్రి కేటీఆర్ అలాగే మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలికారు. కేంద్రం తన నిర్ణయాన్ని మార్చుకునే వరకు వెనక్కి తగ్గవద్దని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణుకు విశాఖ ఉక్కు నిరసన సెగ తగిలింది. సినిమా ప్రమోషన్ కోసం విశాఖ వెళ్లిన మంచు విష్ణును…నిరసనకారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మంచు విష్ణు మద్దతు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు నిరసనకారులు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి టాలీవుడ్ మద్దతు ఇవ్వాలని.. సినీ ప్రముఖులు ఎవరు వచ్చినా అడ్డుకుంటామని కార్మికులు హెచ్చరించారు. అయితే.. దీనిపై మంచు విష్ణు స్పందించారు. ప్రైవేట్ వ్యక్తులు లాభాల్లో నిర్వహిస్తామన్నప్పుడు, ప్రభుత్వానికి ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు మంచు విష్ణు. విశాఖ ఉద్యమానికి మద్దతు తెలపాలని సినీ ప్రముఖులకు ఉన్నా… రాజకీయ కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారని పేర్కొన్నారు. సినీ పెద్దల నిర్ణయం ప్రకారం ముందుకెళ్తామని ఆయన తెలిపారు.
previous post
పెళ్లిపై ఇంట్రస్ట్ లేదు… వాళ్ళకోసమే అలా చెప్పా : సాయి ధరమ్ తేజ్