telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టంగుటూరులో మైనింగ్ భూములపై హైకోర్టు స్టే

ap high court

అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307 ఎకరాల మైనింగ్ భూములు ఇళ్ల స్థలాలకు కేటాయించడం వివాదాస్పదమైంది.

ఈ భూములపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు భూ సేకరణపై స్టే ఇచ్చింది. ఇళ్ల స్థలాలకు, ఇతర అవసరాలకు మైనింగ్ భూముల కేటాయింపు వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related posts