అర్హులైన లబ్దిదారులకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా టంగుటూరు వద్ద 1,307 ఎకరాల మైనింగ్ భూములు ఇళ్ల స్థలాలకు కేటాయించడం వివాదాస్పదమైంది.
ఈ భూములపై దాఖలైన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు భూ సేకరణపై స్టే ఇచ్చింది. ఇళ్ల స్థలాలకు, ఇతర అవసరాలకు మైనింగ్ భూముల కేటాయింపు వద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.