భారత అపర కుబేరుడు, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంపద అంతకంతకూ పెరిగిపోతోంది. బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ సూచీలో అదానీ దూసుకెళ్తున్నారు.
తాజాగా ఫ్రాన్స్కు చెందిన దిగ్గజ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద సంపన్నుడిగా ఎదిగారు.. బ్లూమింగ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
60 ఏళ్ల అదానీ సంపద ప్రస్తుతం 137.4 బిలియన్ డాలర్లు అని బ్లూమ్బర్గ్ లెక్కగట్టింది. ఈ సూచీలో ఆసియా కు చెందిన ఒక వ్యక్తి బ్లూమింగ్ బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ప్రపంచ టాప్ 3 సంపన్నుల్లో చోటు దక్కించుకున్న తొలి వ్యక్తి అదానీనే కావడం విశేషం.
ఇక గౌతమ్ ఆదానీకి ముందు.. ఒకటి, రెండో స్థానాల్లో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, ఆమెజాన్ అధినేత జెఫ్ బేజోస్ ఉన్నారు. మరో భారత కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ 91.9 బిలియన్ డాలర్ల సంపదతో 11వ స్థానంలో కొనసాగుతున్నారు.
గత రెండేళ్లలో అదానీ గ్రూప్నకు చెందిన కొన్ని లిస్టెడ్ కంపెనీల షేర్ల విలువలు 600 శాతానికి పైగా పెరిగాయని బ్లూమ్బర్గ్ గతంలో వెల్లడించింది. దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 25 శాతం వాటా కలిగిన 7 విమానాశ్రయాలు గత 3 ఏళ్లలోనే అదానీ పరం అయ్యాయని బ్లూమ్బర్గ్ తెలిపింది.
ఆదానీ గత కొన్ని సంవత్సరాలుగా తన బొగ్గు, ఓడరేవుల వ్యాపారాన్ని విస్తరించారు .అంబుజా సిమెంట్స్, ఏసీసీలో హోల్సిమ్ గ్రూప్ వాటాను 10.5 బి.డా.కు గత మే నెలలో కొనుగోలు చేయడం ద్వారా, ఒక్కసారిగా దేశీయ సిమెంటు తయారీలో రెండోస్థానానికి అదానీ గ్రూప్ చేరింది.
ఇప్పుడు ఆదానీ గ్రూప్ ఇజ్రాయెల్లో అతిపెద్ద నౌకాశ్రయమైన హైఫాను గత వారంలో 1.18 బి.డా.కు కొనుగోలు చేశారు.
జగన్ వస్తే అవినీతిని సమర్థించినట్టే: భట్టి విక్రమార్క