telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

జగన్‌ వస్తే అవినీతిని సమర్థించినట్టే: భట్టి విక్రమార్క

CLP Batti vikramarka fire KCR KTR

తెలంగాణ లో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ నిధుల దుర్వినియోగం బాధ కల్గిస్తోందని కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ ప్రారంభానికి రావొద్దని ఏపీ సీఎం జగన్‌కు లేఖ రాస్తానని భట్టి విక్రమార్క అన్నారు. ప్రారంభానికి జగన్‌ వస్తే ప్రాజెక్టుల్లో అవినీతిని సమర్థించినట్లేనన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క చుక్క నీరు కూడా రాలేదని విమర్శించారు.

కాళేశ్వరంతో ఎన్ని రిజర్వాయర్లు నింపుతారో ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 15శాతం కూడా పూర్తికాని ప్రాజెక్ట్‌ను ఎలా ప్రారంభిస్తారని ప్రశ్నించారు. తాము అడ్డుకుంటే దేవాదుల, మిడ్‌మానేరు వచ్చేవి కాదని భట్టి అన్నారు. ఇంత వరకు కేసీఆర్‌ కాళేశ్వరం డీపీఆర్‌ ఇవ్వలేదని భట్టి విమర్శించారు.

Related posts