telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోర్టుకు రాలేనన్న జగన్.. పిటిషన్ పై నేడు విచారణ

jagan

వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు సీబీఐ కోర్టులో విచారణ జరుగనుంది. తాను ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును కోరుతూ గతంలోనే జగన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలని సీబీఐకి స్పెషల్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తాజాగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ, ఈ కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ అని పేర్కొంది.

ప్రస్తుతం జగన్ సీఎంగా ఉన్నందున వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇస్తే, సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేసింది. వారానికోసారి కోర్టుకు హాజరయ్యేందుకు ఇబ్బందులు ఏముంటాయని ప్రశ్నించింది.సీబీఐ కౌంటర్ పిటిషన్ పై నేడు వాదోపవాదాలు జరగనున్నాయి. అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జగన్ వ్యక్తిగత హాజరుపై నిర్ణయం తీసుకోనున్నారు.

Related posts