వైసీపీ ఆరు నెలల పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆరు నెలల పాలన ను ఆరు పదాల్లో చెప్పొచ్చని పేర్కొన్నారు. ‘శ్రీ జగన్ రెడ్డిగారి ఆరు నెలల పాలన ఆరు మాటల్లో చెప్పాలంటే విధ్వంసం, దుందుడుకు తనం, కక్ష సాధింపుతనం, మానసిక వేదన, అనిశ్చితి, విచ్ఛిన్నముగా చెప్పొచ్చు’ అని ట్వీట్టర్ లో పేర్కొన్నారు.
ఒక్కో పదంపై ఆయన వివరణ ఇచ్చారు. కూల్చివేత పర్వాలు, ఉద్దేశపూర్వక వరద నీరుతో రాజకీయ క్రీడలు కార్మికుల ఆత్మహత్యలు విధ్వంసం కింది వస్తాయని అన్నారు. కాంట్రాక్టు రద్దులు, అమరావతి రాజధాని, జపాన్ రాయబారి-సింగపూర్ ప్రభుత్వాల నిరసనలు దుందుడుకుతనం కిందకు వస్తాయని పవన్ పేర్కొన్నారు.శ్రీకాకుళంలో సామాన్యకార్యకర్తతో మొదలు కొని ఎమ్మెల్యే రాపాకపై కేసులు బనాయించడం, పోలీసుల వేధింపులు వంటివి కక్ష సాధింపుతనం కిందకు వస్తాయని పేర్కొన్నారు.