telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేపు బిహార్‌కు సీఎం కేసీఆర్‌..గల్వాన్ బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం బిహార్‌లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి ఆయన పాట్నా వెళ్లనున్నారు. గాల్వాన్ లోయలో భారత్, చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో అమరులైన ఇండియన్ ఆర్మీ కుటుంబాలకు ఆర్ధిక సాయం సీఎం అందజేస్తారు.

అలాగే ఇటీవల సికింద్రాబాద్ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్‌ వలస కార్మికుల కుటుంబాలకు సీఎం ఆర్థిక సాయం చేయనున్నారు.

కాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి కేసీఆర్ చెక్కులు పంపిణీ చేస్తారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆహ్వానం మేరకు, మధ్యాహ్నం లంచ్ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు.

Related posts