telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ వెళ్లేందుకు అనుమతివ్వండి.. కేంద్రానికి లేఖ రాసిన సిద్ధూ

EC Issues notices to Minister siddu

పాకిస్థాన్ వెళ్లేందుకు తనకు అనుమతి మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కేంద్రానికి లేఖ రాశారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం కర్తార్ పూర్ సాహిబ్ గురుద్వారా కారిడార్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నెల 9న లాంఛనంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలంటూ సిద్ధూకు కూడా ఆహ్వానం అందింది. ఈ నేపథ్యంలో అనుమతి మంజూరు చేయాలంటూ కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ ను సిద్ధూ కోరారు.

కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాక్ ప్రభుత్వం తనను కూడా ఆహ్వానించిందని, పాక్ వెళ్లేందుకు అనుమతించాలని సిద్ధూ తన లేఖలో విజ్ఞప్తి చేశారు. కాగా, సిద్ధూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు మంచి స్నేహితుడు. ఇద్దరూ క్రికెటర్లు కావడంతో మైదానంలో వీరిమధ్య స్నేహం బలపడింది. ఇద్దరూ రాజకీయాల్లో ప్రవేశించి తమదైన ముద్ర వేస్తున్నారు. కొంతకాలం కిందట పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూపై విమర్శల వర్షం కురిసిన విషయం తెలిసిందే.

Related posts