telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదు: మంత్రి బొత్స

చంద్రబాబుపై తమకు ఎలాంటి కక్ష లేదని ఏపీ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మరో అరగంట గేట్లు ఎత్తకుంటే చంద్రబాబు ఇల్లు మునిగేదని బొత్స స్పష్టం చేశారు. ఇచ్చారు. రాజధానిపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఇల్లు మునుగుతుందని తెలిసే చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌ వెళ్లిపోయారని దుయ్యబట్టారు.

రాజధాని రైతులు కౌలు విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనపై స్పందించిన ఆయన ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వరద సమయంలో ప్రాజెక్ట్‌లపై సమీక్షలు జరిపామని, వరద ప్రాంతాల్లో ఎవరికీ ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు.ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ తమకు చేతకాదని లేనిపోని ఆరోపణలు చేశారని అన్నారు.

Related posts