హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతికి ఎంతో విశిష్టిత ఉంది. ఇక్కడ ఏర్పడే భారీ గణనాధుని తిలకించేందుకు లక్షలాది మంది వస్తుంటారు. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా భారీ గణపతి స్థానంలో ఆరు అడుగుల వినాయక విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠిస్తున్నారు.
ఈ సంవత్సరం వినాయకుడు ‘ధన్వంత్రి నారాయణ మహా గణపతి’ ఆకృతిలో కొలువుదీరనున్నాడని ఖైరతాబాద్ మహా గణపతి ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ సింగరి సుదర్శన్ తెలిపారు. విగ్రహాన్ని పూర్తిగా మట్టితోనే తయారు చేయనున్నామని ఆయన అన్నారు. విగ్రహ నిర్మాణం పనులు ఈరోజు ఉదయం 11 గంటలకు మొదలవుతాయని తెలిపారు.