రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య ఫామ్ లో లేదు. వరుసగా ప్లాపులే పలకరిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత ఆమె ఓ తెలుగు సినిమాలో నటించనుంది. మన్మథుడు -2 తర్వాతే రకుల్ తెలుగు సినిమాల్లో నటించలేదు. వరుసగా తమిళ్, హిందీ సినిమాల్లో ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలిసింది. స్టార్ రైటర్ కొన కరణం మల్లీశ్వరి బయోపిక్ తీయడానికి స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఆయనతో పాటు ఎంవీవీ సత్యనారాయణ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. సంజనా రెడ్డి దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో ముందుగా తాప్సీని లీడ్ రోల్ కి తీసుకోవాలనుకున్నా ఆమెకు డేట్స్ అడ్జెస్ట్ కాలేదు. ఆమె హిందీ సినిమాకు కమిట్ అయ్యింది. దీంతో ఆ స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్లేయర్ పాత్ర కావడంతో రకుల్ అయితే ఫిట్ గా ఉంటుందని భావిస్తున్నారు. నిజంగా రకుల్ కి ఇది మంచి అవకాశమే. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ సహా పలు భాషల్లో నిర్మిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో రానున్న విరూపాక్ష చిత్రంలో కూడా రకుల్ నటించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. రకుల్ ఈ సినిమాలతో మళ్ళీ బిజీ కానున్నారు.
previous post