ప్రజా చైతన్య యాత్రలో భాగంగా రెండు రోజుల క్రితం విశాఖపట్టణంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిందితులపై కేసులు నమోదు అయ్యాయి. చంద్రబాబు కాన్వాయిపై చెప్పులు, టమాటాలు, గుడ్లు విసిరిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
విశాఖలో చంద్రబాబు యాత్రను నిరసిస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జేటీ రామారావుపైనా, వైసీపీ నాయకురాలు ఎన్. కృపాజ్యోతిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. జేటీ రామారావు, కృపాజ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అదేవిధంగా టీడీపీ నాయకులపైనా కేసులు నమోదయ్యాయి.