telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబును అడ్డుకోవడంపై గవర్నర్‌కు టీడీపీ ఫిర్యాదు

TDP Change Puthalapattu Candidate

విశాఖ పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడంపై ఆ పార్టీ నేతలు ఈరోజు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు అన్ని అనుమతులు ఉన్నాయని, అయినా రాజకీయ కక్షతో అడ్డుకున్నారని ఆరోపించారు. 

ఏపీ సీఎం జగన్ విశాఖలో పులివెందుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. సీనియర్‌ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ తమ ఫిర్యాదుపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించారన్నారు. విశాఖలో మొన్న జరిగిన ఘటన చూసి దేశం అంతా నవ్వుకుందన్నారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ జెడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబును రౌడీషీటర్లు అడ్డుకోవడంపై మండిపడ్డారు.

Related posts