డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు టీమ్ఇండియా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉందని తెలిపాడు టెస్ట్ బ్యాట్స్మన్ హనుమ విహారీ. ఈ మెగా ఫైనల్తో పాటు ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు టీమిండియా రెడీగా ఉందన్నాడు. ఇంగ్లండ్లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తాజాగా ఇండియా టూడేతో మాట్లాడిన హనుమ విహారీ.. ఇంగ్లండ్ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘డబ్ల్యూటీసీ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్ కోసం బాగా సిద్ధమవుతున్నాను. ఇది డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్ కాబట్టి భారత అభిమానులందరూ ఆసక్తిగా, ఉత్కంఠంగా ఎదురుచూస్తుంటారు. మేం ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అది మాకు కఠిన సవాలే. అయితే, భారత జట్టు అద్భుతాలు చేయగలదు. ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలను. డబ్ల్యూటీసీతో పాటు ఇంగ్లండ్తో సిరీస్లో నా సాయశక్తుల రాణించడానికి కృషి చేస్తా’అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు. అయితే గాయం కారణంగా స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్కు దూరమైన విహారి.. డబ్ల్యూటీసీ ఫైనల్తో మళ్లీ టెస్టు జట్టులో చేరనున్నాడు.
previous post
next post
సీఎంపై టీడీపీ సభ్యులు అనుచిత వ్యాఖ్యలు: వైసీపీ