కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో 15 శాసనసభ స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికలకు 8 మంది పేర్లను ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ మాట్లాడుతూ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ 8 మంది పేర్లను ఆమోదించారని చెప్పారు. మిగిలిన స్థానాలకు కూడా పేర్లను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన చెప్పారు.
కాంగ్రెస్ అభ్యర్థులుగా భిమ్మన్న నాయిక్ (యెల్లాపూర్), బిహెచ్ బన్నికోడ్ (హిరేకెరూర్), కెబి కోలివాడ్ (రన్నెబెన్నూర్), ఎం అంజనప్ప (చిక్కబళ్లాపూర్), ఎం. నారాయణ స్వామి (కె.ఆర్ పురా), ఎం. శివరాజ్ (మహాలక్ష్మి లే అవుట్), పద్మావతి సురేష్ (హోస్కోట్), హెచ్పి మంజునాథ్ (హున్సూర్)లు పోటీ చేయనున్నారు.