telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లోకేష్ పై కేసు..అవగాహన లేకుండా డ్రైవింగ్ చేశాడంటూ

lokesh comments on jagan on security of

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై పోలీస్ కేసు నమోదైంది. ఆకివీడు పోలీస్ స్టేషన్ పరిధిలో నారా లోకేష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి అవగాహన లేకుండా డ్రైవింగ్ చేస్తూ.. కొందరిని ట్రాక్టర్ ఎక్కించుకుని నిర్లక్ష్యంగా వారి ప్రాణాలకు హాని కలిగించేలా అక్కడున్న రోడ్లపై అవగాహన లేకుండా ట్రాక్టర్ డ్రైవింగ్ చేసినందుకు గాను నారా లోకేష్ పై పోలీస్ కేసు నమోదైంది. కోవిడ్-19 నిబంధనలు పాటించకుండా కార్యక్రమాలు నిర్వహించి నందుకు ఆకివీడు పోలీసులు నారాలోకేష్ పై కేసు నమోదు చేశారు. కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద వరదల వలన పాడైన చేపలను పరిశీలించడానికి ఆ జిల్లాలో పర్యటించారు లోకేష్. అక్కడి మత్స్యకారులతో మాటా మంతి కూడా చేసారు. కానీ అప్పుడే లోకేష్ కు ప్రమాదం తప్పింది. ఆకివీడు మండలం సిద్ధాపురం వద్ద లోకేష్ ట్రాక్టర్‌ నడిపారు. టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజుతో కలిసి ట్రాక్టర్‌పై వెళుతుండగా అదుపు తప్పి ట్రాక్టర్‌ ఉప్పుటేరు కాల్వలోకి దూసుకెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే రామరాజు ట్రాక్టర్‌ను అదుపుచేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

Related posts