బద్వేలులో అధికార పార్టీ వైసీపీ మరోసారి తన సత్తా చాటింది. బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ వైసీపీ ఆధిక్యత కనబరుస్తోస్తూ వచ్చింది. తన సమీప బీజేపీ అభ్యర్థి సురేష్పై 90,590 ఓట్ల భారీ మెజార్టీతో సుధా గెలుపొందారు.
బద్వేల్లో వైసీపీ అభ్యర్థి సుధ భారీ విజయం సాధించారు. 90,590 ఓట్ల భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. వైసీపీకి మొత్తం 1 లక్షా 11 వేల 710 ఓట్లు రాగా, బీజేపీకి 21 వేట 612 ఓట్లు లభించాయి.
బద్వేల్లో మొత్తం 1 లక్షా 47 వేల 213 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైసీపీకి 1 లక్షా 12 వేల 211 ఓట్లు లభించాయి. బిజెపికి 21 వేల 678 ఓట్లు కాంగ్రెస్ కు 6 వేల 235 ఓట్లు వచ్చాయి. నోటాకు 3 వేల 635 ఓట్లు వచ్చాయి. ఇదిలావుంటే, పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి 139, బీజేపీకి 17, కాంగ్రెస్కు 18 ఓట్లు లభించాయి. నోటాకు 1 ఓటు వచ్చింది. దీంతో 90 వేల 590 ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది.
బద్వేల్లో భారీ విజయాన్ని సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్లే భారీ విజయం సాధించగలిగామని తెలిపారు. 2024 ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు రిపీట్ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నేతలు.