ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ ఘాటుగా స్పందించారు. కోవిడ్ రోగులకు ఆసుపత్రిలో బెడ్ లు దొరకడంలేదన్నారు. సీరియస్ పేషెంట్లకు ఆక్సిజన్ అందడంలేదంటూ ట్వీట్ చేశారు. నేతల సిఫారసుతో వచ్చినవారికి బెడ్ లు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలో ఆసుపత్రులను కాదని పొరుగు రాష్ట్రాలకు ఆక్సిజన్ తరలిపోతోందని అన్నారు. ఆక్సిజన్ సరఫరాలో మాఫియా రాజ్యం తయారైందని ఆరోపించారు. కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ రేటు చెల్లిస్తున్న వారికి బెడ్ లు కేటాయిస్తున్న పరిస్థితుల నెలకొన్నాయని తెలిపారు. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 10,830 కేసులు వచ్చాయని, 81 మరణాలు సంభవించాయని తెలిపారు. కేసుల విషయంలో దేశంలోనే ఏపీ అత్యధికమని విమర్శించారు.
ఓడిపోయిన చోట పవన్ మొహం చూపించలేదు: అంబటి