తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోజు చారిత్రాత్మకమైనదని పవన్ అభివర్ణించారు. కోట్లాది మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నామని అన్నారు.
అభివృద్ధి ఫలాలు అందరికీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు నడిపే ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కోట్లాది మంది కల సాకారమైన ఈ రోజున తెలంగాణ సాధనలో ప్రాణాలు అర్పించిన త్యాగధనులకు అంజలి ఘటిస్తున్నట్టు తెలిపారు.
సీఏఏ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి