telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

క్షమాబిక్ష అడగలేదంటున్న.. నిర్భయ నిందితుడు.. శిక్ష ఎప్పుడంటున్న ప్రజలు, బాధితులు ..

nirbaya accused not requesting for apology

దిశ ఘటనతో మళ్లీ ‘నిర్భయ’ కేసు తెరపైకి వచ్చింది. ఆ మృగాళ్లకు ఎప్పుడు శిక్ష పడుతుందని.. దేశవ్యాప్తంగా.. ప్రజలందరూ.. ప్రశ్నిస్తున్నారు. వారికి శిక్ష ఎప్పుడు విధిస్తారంటూ.. ప్రశ్నల తాకిడి మొదలైంది. ఈ ఘటన జరిగి ఏడేళ్లు అయినా.. నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదు. తాజాగా నిర్భయ ఘటనకు సంబంధించి ఓ నిందితుడి క్షమాభిక్షను కూడా.. రద్దు చేశారు రాష్ట్రపతి. దీంతో.. వారికి ఎప్పుడు ఉరి పడుతుందా అంటూ.. అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ కేసులో అనుకోకుండా ఓ ట్విస్ట్ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. వినయ్‌ శర్మ అనే వ్యక్తి పేరిట ఓ క్షమాపణ పత్రం గవర్నర్ వద్దకు అలాగే రాష్ట్రపతి వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ లెటర్‌తో నాకు సంబంధం లేదని తాను క్షమాభిక్ష కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోదని అతను చెబుతుండటం గమనార్హం. మరి ఇది ఎవరు చేశారనే విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Related posts