telugu navyamedia
రాజకీయ వార్తలు

ఫోర్బ్స్ మ్యాగజైన్ జాబితాలో నిర్మలా సీతారామన్

Nirmala seetharaman

అంతర్జాతీయంగా పేరుగాంచిన ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితా విడుదల చేసింది. ఈ టాప్-100 జాబితాలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా స్థానం కల్పించారు. ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా 34వ స్థానంలో నిలిచారు.

భారత్ నుంచి హెచ్ సీఎల్ కార్పొరేషన్ సీఈఓ రోష్నీ నాడార్ కు ఈ జాబితాలో 54వ స్థానం దక్కింది. బయోకాన్ పరిశ్రమల అధినేత్రి కిరణ్ మజుందార్ షా 65వ స్థానంలో ఉన్నారు. ఇక ఈ జాబితాలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షురాలు క్రిస్టినే లగార్డే, మూడో స్థానంలో అమెరికా పార్లమెంటు స్పీకర్ నాన్సీ పెలోసి ఉన్నారు.

Related posts