telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఉస్మానియా మెడికల్ కాలేజీలో.. 12 మందికి కరోనా పాజిటివ్!

osmania medical Hyd

హైదరాబాదు నగరంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా, ఉస్మానియా మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా రావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. లాక్ డౌన్ కొనసాగుతుండడంతో చాలామంది విద్యార్థులు హాస్టల్ లోనే ఉంటున్నారు.

ఉస్మానియా వైద్య కళాశాల హాస్టల్ లో 296 మంది విద్యార్థులు ఉండగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించారు. దాంతో, 12 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ఇంకా మరికొందరి ఫలితాలు రావాల్సి ఉందని మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ శశికళ వెల్లడించారు.

Related posts