telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమస్యల పరిష్కారం కోసం శాంతియుత ధర్నా: జగ్గారెడ్డి

Jaggareddy gives clarity party change

ప్రజా సమస్యల పరిష్కారం కోసం శాంతియుత ధర్నా చేపడతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సోమవారం నుంచి బుధవారం వరకు జిల్లా కలెక్టరేట్‌ లేదా ఐబీ వద్ద ధర్నా ధర్నా చేపడతామని అన్నారు. పట్టణంలో పలు కాలనీల్లో ప్రజలు తీవ్ర నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

పట్టణంలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా తాగునీటి సమస్యలపై ఎంతగా పోరాడినా ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు.సింగూరు జలాలను తరలించడం వల్లే ఈ ప్రాంత ప్రజలు అవస్థలు పడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. సింగూరు జలాల తరలింపును అడ్డుకోటానికి తాను ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రభుత్వం పట్టిచుకోలేదన్నారు. తాను ప్రజల కోసం పోరాడితే టీఆర్‌ఎస్‌ నాయకులు తన వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts