telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జనసేన కార్యాలయానికి రైతులు..కాసేపట్లో పవన్‌తో సమావేశం!

janasena

రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయంటూ ఏపీ ప్రభుత్వం చేసిన ప్రకటనతో అమరావతి రైతులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. రైతులు తమ బాధలను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెప్పుకోవడానికి మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

ప్రభుత్వ వైఖరి, పోలీసుల లాఠీచార్జితో పాటు పలు విషయాలపై వారు పవన్ కు తెలుపనున్నారు. తమ తరఫున పోరాడాలని జనసేనానికి రైతులు కోరనున్నారు. కాసేపట్లో రైతులతో పవన్ చర్చించి, ఆ తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీతో కలిసి పోరాడతామని ఇప్పటికే జనసేన పార్టీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Related posts