క్రైస్తవులకు సంబంధించిన జెరూసలేం గురించి హిందు పుణ్యక్షేత్రాల వద్ద ప్రచారం చేయటం నేరమని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మట్లాడుతూ తిరుమలలో ఆర్టీసీ బస్ టికెట్ వెనుక “జెరూసలేం యాత్ర” గురించి ప్రింట్ చేయటాన్నిఆయన ఖండించారు.
హిందు ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి జగన్కు తెలిసే జరుగుతోందా? లేక తెలియకుండా జరుగుతోందా? అని ప్రశ్నించారు. హిందువుల పుణ్యక్షేత్రాల వద్ద అన్యమత ప్రచారం చేయడం నేరమని తెలిపారు. ఈ విషయం పై సీఎం జగన్ వెంటనే స్పందించి, అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజసింగ్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి దారుణం: కేజ్రీవాల్