ప్రముఖ దర్శకుడు శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన చిత్రం “భారతీయుడు”. అప్పట్లో ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా “ఇండియన్-2” టైటిల్ తో సినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో కమల్ డ్యూయల్ రోల్ పోషించనున్నట్టు సమాచారం. కాజల్ అగర్వాల్, ప్రియా భవాని శంకర్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ద్ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈరోజు “కౌసల్య కృష్ణమూర్తి” చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఐశ్వర్య రాజేష్ కూడా చిత్రంలో కీలక పాత్ర చేయనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఈ తెలుగమ్మాయి “ఇండియన్-2” నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో తాను “ఇండియన్-2″కి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతుందట. ఈ క్రమంలో ఐశ్వర్య “ఇండియన్-2” చిత్రం నుండి తప్పుకుందని సమాచారం. ఐశ్వర్య రాజేష్ తెలుగు డెబ్యూ చిత్రం “కౌసల్య కృష్ణమూర్తి” ఈ రోజే విడుదల కాగా, ఈ చిత్రం మంచి టాక్తో దూసుకెళుతుంది. రైతుల సమస్యను, క్రికెటర్గా ఎదుగాలనుకొన్న యువతి కథను అద్భుతంగా మేళవిస్తూ చిత్రాన్ని రూపొందించారని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంటోంది.
ప్రభుత్వం అనుమతి ఇచ్చినా షూటింగ్స్ చేయడం చాలా కష్టం : సి. కళ్యాణ్