telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో జనసేతో బీజేపీ: లక్ష్మణ్

BJPpresident -K-Laxman

తెలంగాణలో జనసేనతో కలిసి ముందుకు సాగుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఓ ప్రకటన చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై తాము జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ రాని స్థానాల్లో కూడా ఆ పార్టీ దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకుంటోందని ఆరోపించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల పట్ల టీఆర్ఎస్ వైఖరి ఆక్షేపణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేను తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు.

Related posts