తెలంగాణలో జనసేనతో కలిసి ముందుకు సాగుతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఓ ప్రకటన చేశారు. ఈ రోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఈ అంశంపై తాము జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనైతిక చర్యలకు పాల్పడుతుందని పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మెజారిటీ రాని స్థానాల్లో కూడా ఆ పార్టీ దొడ్డి దారిన ఛైర్మన్ పదవులను దక్కించుకుంటోందని ఆరోపించారు. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్ల పట్ల టీఆర్ఎస్ వైఖరి ఆక్షేపణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేకేను తెలంగాణలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎలా పేర్కొంటారని ఆయన ప్రశ్నించారు.