telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక సినిమా వార్తలు

వేణుమాధవ్ అంతిమయాత్ర ప్రారంభం!

Venu

నిన్న అనారోగ్యంతో మృతి చెందిన హాస్యనటుడు వేణుమాధవ్ అంతిమ యాత్ర మొదలైంది. కమెడియన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేసిన వేణు మాధవ్ ని కడసారి చూసేందుకు అభిమానులు సినీ ప్రముఖులు ఫిల్మ్ ఛాంబర్ కి చేరుకుంటున్నారు. మౌలాలి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి భౌతికకాయాన్ని తీసుకువెళ్లనున్నారు.

ఫిల్మ్ ఛాంబర్ లో రెండు గంటలపాటు అభిమానుల సందర్శనార్ధం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం తిరిగి మౌలాలికి తరలించనున్నారు. లక్ష్మి నగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వేణు మాధవ్ పెద్ద కుమారుడు మాధవ్ సవికర్ చేతుల మీదుగా వేణు భౌతికాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వేణు మాధవ్ మృతి పట్ల పలువురు ప్రముఖులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Related posts