జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. పవన్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చంద్రబాబుతో కుమ్మక్కై సీఎం జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పవన్ దత్త పుత్రుడిలా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. రెండోచోట్ల పవన్ పోటీ చేస్తే ప్రజలు ఎందుకు ఓడించారో తెలుసుకోవాలన్నారు. ఆయన ఓడిపోయిన చోట ఇప్పటివరకూ మొహం చూపించలేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు, పోలవరం రివర్స్ టెండరింగ్ అంశాలను వివరించేందుకే కేంద్ర మంత్రి అమిత్ షాను కలిశారని పేర్కొన్నారు. రాష్ట్ర సమస్యలను ఒక ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జగన్ బాధ్యత అని అంబటి పేర్కొన్నారు. ఈ విషయం మరిచిపోయిన జగన్పై కేసులు విచారణ జరుగుతుండగానే నేరస్తుడు అంటూ ఎలా అంటారని ప్రశ్నించారు. వేల పుస్తకాలు చదివానని గొప్పలు చెప్పుకొనే పవన్ కల్యాణ్కు ఈ సంగతి తెలియదా అంటూ అంబటి ఎద్దేవా చేశారు.