telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న తనికెళ్ళ భరణి

thanikella-bharani

టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా సాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటారు సినీ నటుడు తనికెళ్ళ భరణి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు హరిత యజ్ఞం రూపంలో మళ్ళీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను సంతోష్ కుమార్ గారు దేశ వ్యాప్తంగా విస్తరించి ముందుకు తీసుకెళ్తున్నారని తనికెళ్ళ భరణి అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ విసిరిన ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ శ్రీనగర్ కాలనీ లోని తన నివాసంలో లో మొక్కలు నాటారు సినీ నటుడు తనికెళ్ళ భరణి. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నానని తెలిపారు. సుహాసిని మణిరత్నం, డైరెక్టర్ త్రివిక్రమ్, సినీ నటులు నాజర్, ప్రకాష్ రాజ్ లకు ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసురుతున్నట్లు వారు దీనిని స్వీకరించి మొక్కలు నాటాలని తనికెళ్ళ భరణి పిలుపునిచ్చారు

Related posts