అమరావతి రైతులు మరింత ఆశాభావంతో ఉండాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టంపై స్టేటస్ కోను ఏపీ హైకోర్టు సెప్టెంబరు 21 వరకు పొడిగించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. న్యాయం కోసం పోరాడుతున్న అమరావతి రైతులకు దక్కిన పాక్షిక విజయం అని అభివర్ణించారు.
గాంధేయ మార్గంలో రైతులు ముందుకెళ్లాలని అమరావతి రైతులకు ఉద్బోధించారు. దేవుడు తమవైపు ఉన్నాడని, న్యాయం తమవైపు ఉందని అన్నారు. స్టేటస్ కో అయినా, స్టే అయినా పెద్దగా తేడా ఏమీ లేదని, న్యాయమూర్తులే దేవుళ్లని పేర్కొన్నారు. కౌలు అడిగిన రైతులను అరెస్ట్ చేసి నిన్న సాయంత్రం వదిలినట్టు తనకు తెలిసిందని చెప్పారు. రైతులను అరెస్ట్ చేయడం బాధాకరమనిఆయన పేర్కొన్నారు.