telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హత్యలు, అత్యాచార ఘటనల్లో నిందితుల్లో ఎక్కువగా టీడీపీ వారే..

ఏపీలో జరుగుతున్న హత్యలు, అత్యాచార ఘటనల్లో నిందితుల్లో ఎక్కువగా టీడీపీ వారే ఉన్నారని ఏపీ హోం మంత్రి తానేటి వనిత విమర్శించారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో రేపల్లే గ్యాంగ్ రేప్ బాధితురాలిని మంత్రి సోమవారం ఉదయం పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని డాక్లర్లను అడిగి తెలుసుకొన్నారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి వైద్యులను ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ నేతల ప్రమేయంతోనే ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయని మంత్రి తానేటి వనిత విమర్శించారు. .

రేపల్లె రైల్వేస్టేషన్‌ ఘటన బాధాకరమని హోంమంత్రి వనిత అన్నారు. ఈ ఘటన సమయంలో భర్తపై దాడి చేస్తున్న బాధ్యులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన భార్యపై ఘాతుకానికి పాల్పడ్డారని ఆమె వివరించారు.

మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను తక్షణమే అరెస్ట్ చేశామని మంత్రి తానేటి వనిత తెలిపారు. బాధ్యులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశామన్నారు.

అయితే ఊహించని ఘటన కారణంగా ప్రస్తుతం బాధితురాలి మానసిక స్థితి దెబ్బతిందని మంత్రి చెప్పారు…బాధితురాలికి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన అన్నిరకాల పరిహారాలు అందిస్తామన్నారు.

అత్యాచార ఘటనలకు గురైన బాధితుల వివరాలు తెలిపే విషయంలో గోప్యత పాటించాలని మీడియాకు హితవు పలికారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.

Related posts