telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధం: నాదెండ్ల

Nadendla baskar rao

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కేంద్ర హోం మంత్రి అమీత్ షా సమక్షంలో నేడు బీజేపీ కండువా కప్పుకున్న కప్పుకున్నారు. అనంతరం ఓ ఛానల్‌తో మాట్లాడుతూ నాదెండ్ల మాట్లాడుతూ బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కన్నారు. పార్టీ ఆదేశిస్తే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్నారు.తనకు ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహిస్తానని నాదెండ్ల వెల్లడించారు.

తన కుమారుడి రాజకీయ జీవితం అతని వ్యక్తిగమని, స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే హక్కు అతనికి ఉందన్నారు. కాంగ్రెస్ ఇక మీదట కోలుకోవడం కష్టమన్నారు. తనను మోదీ 2014లోనే బీజేపీలోకి ఆహ్వానించారని, కానీ తన కుమారుడు స్పీకర్ పదవిలో ఉన్నందున తాను తిరస్కరించాల్సి వచ్చిందని నాదెండ్ల స్పష్టం చేశారు.

Related posts