ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రబాబు కాన్వాయి పై రాళ్లు రువ్వారు. నల్ల జెండాలతో వైసీపీ కార్యకర్తలు పలు చోట్ల ఆందోళనకు దిగారు.అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య వెంకటపాలెంలో ఘర్షణ జరిగింది. ఈ ఘటన పై చంద్రబాబుఘాటుగా స్పందించారు.ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం సరికాదన్నారు.
రాజధాని అమరావతిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు. రాజధాని అంశాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వారిని అవమానిస్తున్నారని చంద్రబాబు అన్నారు.