తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ (ఐసిజిఎస్)లోకి అనిబీసెంట్, అమృత్కౌర్ నౌకలు వచ్చి చేరాయి. కేంద్ర డిఫెన్స్ సెక్రటరీ అజరుకుమార్ ఆధ్వర్యాన కొల్కత్తా తీరంలో ఈ అధునాతన నౌకలు కమిషనింగ్ చేయబడినట్లు తీర గస్తీ దళ అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కోస్ట్ గార్డ్ కె.నటరాజన్, అడిషనల్ డైరెక్టర్ జనరల్ (కోస్ట్గార్డ్ కమాండర్, ఈస్టర్న్ సీ బోర్డ్) విఎస్.పథానియా, ఇతర అధికారులు కోస్ట్గార్డ్ ఈస్టర్న్ సీ బోర్డుపై ఉండగా ఈ కార్యక్రమం జరిగింది. దేశీయ టెక్నాలజీతో ఈ నౌకలు నిర్మించబడ్డాయని, ఈ నౌకల్లో 40/60 గన్స్ (బోఫార్స్ టెక్నాలజీవి) దీంట్లో అమర్చబడి అత్యంత సమర్థవంతంగా ఉంటాయని తెలిపారు.
previous post