telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ నివాసంలో కుక్క చనిపోతే పోలీస్ కేసులు: రేవంత్ రెడ్డి ఫైర్

Revanth-Reddy mp

తెలంగాణ సీఎం కేసీఆర్ నివాసంలో హస్కీ అనే 11 నెలల శునకం ఇటీవల చనిపోయింది. దీంతో పశు వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే కుక్క చనిపోయిందని బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆసుపత్రిలో డాక్టర్ రంజిత్, నిర్వాహకురాలు లక్ష్మీలపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా స్పందించారు.

తెలంగాణలో ఓవైపు ప్రజలు విష జ్వరాలతో అల్లాడుతుంటే పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ నివాసంలో కుక్క చనిపోతే మాత్రం పోలీస్ కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రగతి భవన్ లో కుక్కకు ఉన్న విలువ కూడా బంగారు తెలంగాణలో మనుషులకు లేదా? అని నిలదీశారు. ఈ మేరకు ట్విట్టర్ లో  రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్న పత్రికల కథనాలను పోస్ట్ చేశారు. అలాగే తన ట్వీట్ కు తెలంగాణ సీఎం కార్యాలయం, రాష్ట్ర ఆరోగ్య శాఖలను ట్యాగ్ చేశారు.

Related posts