telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

టిటిడి ఛానల్ కొత్త ఛైర్మనుగా మాజీ ఎమ్మెల్యే..

టిటిడి ఛానల్ 12 సంవత్సరాలుగా కొనసాగుతున్న అస్థవ్యస్థ పరిపాలనను గాడిలో పెడుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక ప్రచారం కోసం 2008లో యస్వీబిసి ఛానల్ ని ప్రారంభించింది. అప్పటి రాష్ర్టపతి ప్రతిభా పాటిల్ చేతులు మీదుగా ఛానల్ ని అట్టహాసంగా ప్రారంభించారు. శ్రీవారి ఆలయంలో కార్యక్రమాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలను భక్తుల ముందుంచడమే లక్ష్యంగా ఛానల్ ని ప్రారంభించింది టిటిడి. ఇక ఛానల్ పరిపాలనా వ్యవహారాలను చూసుకోవడానికి ప్రత్యేకంగా బోర్డ్ ని, చైర్మన్ ని కూడా నియమించింది టిటిడి. ఇలా గొప్పగా ప్రారంభించిన ఛానల్ అనతికాలంలోనే వివాదాలుకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది. ఆ తరువాత ఛానల్ ప్రతిష్ఠతో పాటు టిటిడి పరువును కాపాడవలసి వుండడంతో ఆ బాధ్యతలను టిటిడి అదనపు ఇఓ దర్మారెడ్డి కి అప్పగించారు టిటిడి పాలకమండలి చైర్మైన్ వైవి సుబ్బారెడ్డి. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో మరో వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మనుగా మాజీ ఎమ్మెల్యే వీబీ సాయి కృష్ణ యాచేంద్రని నియమించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే యాచేంద్రను నియమిస్తున్నట్లు దేవదాయ శాఖ తెలిపింది.

Related posts